AP: పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 12:40 గంటలకు వినుకొండకు చేరుకుంటారు. పట్టణంలోని ఎన్నెస్పీ మైదానంలో నిర్వహించే స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. స్వచ్ఛరథాలను ప్రారంభించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. మధ్యాహ్నం 3:05 గంటలకు టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు.