GNTR: మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ‘రథారోహణ’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉత్సవ మూర్తులను దివ్య రథంపై ప్రతిష్ఠించగానే, స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తుల రాకతో ఆలయ పరిసరాలు భక్తిభావంతో, కోలాహలంగా మారాయి. భక్తుల గోవింద నామస్మరణ స్మరించుకున్నారు.