HYD: ‘ఫ్యూచర్ సిటీ’ నుంచి ఏపీ రాజధాని అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేకు సమాంతరంగా సెమీ బుల్లెట్ ట్రైన్ రానుంది. గంటకు 250 కి.మీ. వేగంతో ప్రయాణించే ఈ రైలు ద్వారా HYD నుంచి అమరావతికి కేవలం గంటన్నరలోనే చేరుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనతో మిర్యాలగూడ మీదుగా సాగే ఈ కారిడార్ను చెన్నై వరకు పొడిగిస్తే 3 గంటల్లోనే వెళ్లొచ్చు.