ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్లు దుబాయ్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఒకే వేదికపై మ్యాచ్లు ఆడటం వల్ల టీమిండియాకు కలిసోస్తుందని పలు దేశాల మాజీలు విమర్శిస్తున్నారు. దీనిపై తాజాగా మాజీ స్పిన్నర్ అశ్విన్ స్పందించాడు. బాగా ఆడితే టోర్నమెంట్లను గెలుస్తారని, సాకులతో కాదని తెలిపాడు. టీమిండియా బాగా ఆడటం వల్లే ఫైనల్కు చేరిందని స్పష్టం చేశాడు.