ADB: ఉట్నూర్ మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైప్ లైన్ శుక్రవారం ఉదయం పగిలి నీరు వృధాగా పారుతుంది. కాగా పాత ఉట్నూర్లోని మాజీ జడ్పీ ఛైర్మన్ జనార్దన్ ఇంటి సమీపంలో ఉన్న పైప్ పగిలి నీళ్లు రోడ్డుపై వస్తున్నాయి. దీంతో అటువైపు వెళ్లే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పైప్ లైన్లను బాగు చేసి నీటి వృధాను అడ్డుకోవాలన్నారు.