NRPT: మద్దూర్ పట్టణ కేంద్రంలోని నాగిరెడ్డి చెరువు కట్టపై శుక్రవారం ఉదయం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చనిపోయిన కోళ్లను తీసుకువచ్చి చెరువు కట్టకు ఇరువైపులా పడవేశారు. బర్డ్ ఫ్లూ వస్తున్న సందర్భంగా ఇప్పటికే ప్రజలు చికెన్ తినడానికి భయపడుతున్నారు. అలాంటిది చనిపోయిన కోళ్లను ఇలా వేయడంపై మద్దూర్ పట్టణ కేంద్రానికి చెందిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.