MBNR: మార్చి 5 నుంచి 25 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా నిర్వహించాలంటూ కలెక్టర్ విజయేంద్రబోయి అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్లో ఇంటర్మీడియట్ పరీక్షలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలన్నారు.