SRD: ఉమ్మడి కరీంగనర్- మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా రామచంద్రపురంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో భరత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.