MNCL: లక్షెట్టిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను రామగుండం సీపీ శ్రీనివాస్ తనిఖీ చేశారు. గురువారం ఆయన పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి సిబ్బంది నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూ ఉందని తెలిపారు.