RR: గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని ఎనిమిదో వార్డులో శుభగృహ సుకృతి డిలైట్, వెళ్లే దారిలో మదన్ బార్ పక్కన గత నాలుగు రోజులుగా డ్రైనేజీ నిండి మురికి నీరు అంతా బయటకు రోడ్లపైకి రావడంతో దుర్వాసన వెదజల్లుతుంది. అటువైపుగా వెళ్లేవాళ్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని గుండ్ల పోచంపల్లి మున్సిపల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్ తెలిపారు.