రంగారెడ్డి: భర్తతో గొడవపడి ఓ మహిళ అదృశ్యమైన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సూర్యపేట జిల్లా తుంగతుర్తికి చెందిన కె.సురేష్, జయమ్మ దంపతులు వృత్తిరిత్యా నాగోలు శ్రీనివాసకాలనీలో నివసిస్తున్నారు. అయితే, భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన జయమ్మ తాను చనిపోతానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.