HYD: జాంబాగ్ డివిజన్ పరిధిలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రారంభించారు. ఆదివారం నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో ఉచితంగా మందులు పంపిణీ చేసి, వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరం నిర్వహించిన నిర్వాహకులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.