AP: విశాఖలో ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్తతలతో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేశారు. అనుమతి లేకుండా ఊరేగింపులు, సభలు నిషేధించారు. ఈనెల 28 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ముందస్తుగా అనుమతులు తప్పనిసరి చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.