ATP: గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం గర్భిణీలకు ఉచిత భోజన కార్యక్రమం నిర్వహించారు. గుత్తి టీడీపీ మండల ఇంచార్జ్ నారాయణ, ఆసుపత్రి సూపరిండెంట్ ఎల్లప్ప చేతుల మీదుగా గర్భిణీలకు భోజనాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ.. గర్భిణీలు పౌష్టిక ఆహారం తీసుకుంటేనే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.