SDPT: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల అదుపునకు సీసీ కెమెరాలు మూడో కన్నులా పనిచేస్తాయని సిద్దిపేట డీసీపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. బొప్పాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన భద్రతా వ్యవస్థను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ సాయంతో నేరగాళ్లను త్వరగా పట్టుకోవచ్చని పేర్కొన్నారు.