CTR: గుడిపాల పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ప్రసాద్ సిబ్బందితో కలిసి జూదంపై దాడి నిర్వహించారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, మరో ముగ్గురు పరారైనట్లు తెలిపారు. ఘటనాస్థలంలో రూ. 4,150 నగదు స్వాధీనం చేసుకున్నారు. అందరూ రామాపురం గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.