CTR: పుంగనూరు నియోజకవర్గానికి చెందిన సి. హేమచంద్రను పార్టీ స్టేట్ పబ్లిసిటీ వింగ్స్ సెక్రటరీగా నియమించారు. ఈ నియామకంపై హేమచంద్ర మాట్లాడుతూ.. పార్టీ ఆశయాలను, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, సూచనలతో ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. కార్యకర్తలు, ముఖ్య నాయకులతో కలసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు.