TG: వరంగల్ నగరానికి వంద ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం అవసరమైన స్థలాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ మేరకు మడికొండలో ప్రతిపాదించిన 5 ఎకరాల స్థలంపై అధికారులు చర్చించారు. ఆ స్థలాన్ని ఆర్టీసీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పరిశీలించి, అవసరమైన ప్రక్రియలను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.