SKLM: పాతపట్నంకి చెందిన నల్లి పోలయ్యకు ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ మంజూరు చెయ్యాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ను సోమవారం ప్రజాదర్బార్లో కలిసి తన సమస్యను వివరించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి వెంటనే స్పందించి తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం పోలయ్యకు ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ను సిబ్బంది అందజేశారు. పోలయ్య కేంద్రమంత్రికు కృతజ్ఞతలు తెలిపారు.