MHBD: జిల్లా కేంద్రంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయాన్ని నేడు ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప మాల ధరించిన గురుస్వాముల ఆహ్వానం మేరకు అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాల వితరణ చేశారు.