MDK: అంబేడ్కర్ను గౌరవించాల్సిన కేంద్ర మంత్రి అమిత్ షా అంబేడ్కర్పై అనుచిత వ్యాఖ్యలు సరికాదని మాల మహానాడు రాయికోడ్ మండల అధ్యక్షుడు దుర్గారామ్ అన్నారు. గురువారం స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, మంత్రి పదవి నుంచి తొలగించాలన్నారు.