KMM: నిరుపేదలకు సీఎం సహాయనిధి ఓ వరమని జిల్లా కాంగ్రెస్ నేత బోడా వెంకన్న గురువారం అన్నారు. తీర్థాల గ్రామపంచాయతీ బీసీ కాలనీలో లబ్ధిదారులకు రూ.29 వేలు విలువగల CMRF చెక్కును గ్రామ కాంగ్రెస్ నేతలతో కలిసి వెంకన్న పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.