WGL: నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన తొమ్మిదవ వార్డ్ సభ్యుడు బుజ్జి బిచ్య నాయక్ సోమవారం TPCC సభ్యులు రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ ఛైర్మన్ హరీష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై చేరినట్లు బిచ్య నాయక్ వెల్లడించారు. అనంతరం రంజిత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.