AP: రాయలసీమ హక్కుల పేరుతో ప్రజలను వైసీపీ మభ్యపెడుతోందని మంత్రి మండిపల్లి మండిపడ్డారు. జగన్ హయాంలో 102 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ చేశారని విమర్శించారు. 2014-19లో టీడీపీ రూ.12,441 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. వైసీపీ కేవలం రూ.2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. చంద్రబాబు దృఢ సంకల్పంతో సాగునీటి ప్రాజెక్టులు వేగవంతం చేసినట్లు వెల్లడించారు.