JN: చిల్పూర్ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. 8 రోజులుగా భక్తుల రద్దీ మధ్య వైభవంగా సాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా హోమాలు, బలిహరణం,మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఇవాళ ఉదయం చక్రస్నానం, సాయంత్రం పుష్పయాగం, ద్వాదశారాధన, ధ్వజావరోహణం వంటి విశేష సేవలు జరిగాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.