MDCL: సికింద్రాబాద్, సిద్దిపేట DEMU ట్రైన్ 77655 మేడ్చల్ స్టేషన్ వద్ద గంటకు పైగా నిలిచిపోవడం ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడినట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆలస్యం రోజువారీగా జరుగుతుండటంతో చాలా ఇబ్బంది ఏర్పడుతుందని, పైగా రైల్లో పరిశుభ్రత కూడా దారుణంగా ఉందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మరోసారి రిపీట్ కాకుండా చూడాలన్నారు.