NRPT: విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గుండుమల్ మండలానికి చెందిన విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు చలో హైదరాబాద్కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హతను బట్టి సబ్స్టేషన్లలో ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయాలని, మీటర్ రీడింగ్ తర్వాత 30 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో 11 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు.