VKB: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9:40 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరి 10 గంటలకు జిల్లాకు చేరుకుంటారు. అనంతరం అనంతగిరిలోని హరిత రిసార్ట్స్ నిర్వహించనున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో సాయంత్రం 4:20 వరకు పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏఐసీసీ, పీసీసీ ముఖ్య నేతలు వీరికి స్వాగతం పలకనున్నారు.