ప్రకాశం: మర్రిపూడి మండలం కూచిపూడిలో తీవ్ర విషాదం నెలకొంది. అంగన్వాడి కార్యకర్త ఉస్తెలమూరి విజయలక్ష్మి శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందింది. 24 సంవత్సరాలుగా గ్రామంలో పనిచేస్తూ గర్భవతులకు, బాలికలకు, చంటి పిల్లలకు సేవలు అందించారు. అందరి ఆదరాభిమానాలను సంపాదించుకున్నారని గ్రామస్థులు అన్నారు. విజయలక్ష్మికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె మరణంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.