ఎన్టీఆర్: వీరులపాడు మండలంలో ట్రాక్టర్ బోల్తా పడి ఓ రైతు మృతి చెందిన ఘటన సోమవారం వేకువ జమున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు, గోకరాజుపల్లి నుంచి గ్రామంలో కూలీలను దించి వస్తుండగా, ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడగా ట్రాక్టర్ టైర్ కింద పడి మహేష్ అనే రైతు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.