MBNR: జిల్లాలోని కురుమూర్తి స్వామి దేవస్థానం 750 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ప్రాచీన క్షేత్రం. ‘పేదల తిరుపతి’గా పేరొందిన ఈ ఆలయాన్ని 13-14వ శతాబ్దాల్లో ఆత్మకూరు–అమరచింత సంస్థానాధీశులు నిర్మించారు. స్వామివారిని కులదైవంగా ఆరాధించిన వారు ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. ఈ క్షేత్రం నాటి రాచరిక వైభవం, భక్తి సంప్రదాయాలను ప్రతిబింబిస్తోంది.