NRPT: జామా మసీదులో ఆదివారం రాత్రి ముస్లింలకు ఇఫ్తార్ విందును మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు రెహమాన్ ఖాన్ ఏర్పాటు చేశారు. సామూహిక ప్రార్థనలు అనంతరం ఉపవాస విరమణ చేసి విందును స్వీకరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పీఎస్ చిట్టెం మాధవరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ లక్ష్మయ్య గౌడ్, ఉప సర్పంచ్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.