SRPT: కోదాడ మండలం తోగర్రాయి గ్రామంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి ఆదివారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి క్రీడా పోటీలు ఎంతో దోహదపడుతాయని అన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు.