SRD: మనూరు మండలం బోరంచ నల్ల పోచమ్మ ఆలయాన్ని రేపు చంద్రగ్రహణం సందర్భంగా మూసివేస్తున్నట్లు ఈవో శివరుద్రప్ప సోమవారం తెలిపారు. మంగళవారం ఉదయం 5 గంటలకు అభిషేకం, అలంకరణ అనంతరం ఉదయం 06:00 గంటలకు ఆలయం మూసి వేస్తారని చెప్పారు. మరుసటి రోజు బుధవారం ఆలయం శుద్ధి, సంప్రోక్షణ తర్వాత అభిషేకం చేసి ఉదయం 8 గంటలకు భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని చెప్పారు.