KNR: శంకరపట్నం మండలం తాడికల్ దొరసాని చెరువులో ఇష్టరాజ్యంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. చెరువులో మట్టిని అక్రమంగా తరలిస్తున్నా సంబంధిత ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మట్టితీతతో పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.