MNCL: అమాయక ప్రజలను నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసిన భీమారం మండలానికి చెందిన బేకరీ నిర్వాహకుడు వేముల శ్రావణ్ గౌడ్ పోలీసులకు చిక్కాడు. తనకు క్వారీ లభించిందని, పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయంటూ సుమారు 62 మంది నుంచి దాదాపు రూ. 2 కోట్ల వరకు అప్పు తీసుకున్నాడు. అనంతరం పరారైన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.