SKLM: రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఆదివారం శ్రీకాకుళం నుంచి ఆమదలవలస రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. ప్రజల సౌకర్యార్థం చేపట్టిన ఈ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు సాగాలని కాంట్రాక్టర్లకు దిశానిర్దేశం చేశారు.