MBNR: జడ్చర్లలో నిర్వహించిన 6వ రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్లో కొత్తకోట మండలం కనిమెట్టకు చెందిన విద్యార్థులు పతకాలతో మెరిశారు. ఒకినావా స్పోర్ట్స్ కరాటే ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో అండర్-11 విభాగంలో వంశీ బంగారు పతకం సాధించగా, అండర్-12 విభాగంలో చంద్రకళ వెండి పతకం కైవసం చేసుకుంది. అలాగే మన్యంకొండకు చెందిన మహేష్ కూడా ప్రతిభ కనబరిచారు.