NRML: చంద్రగ్రహణం సందర్భంగా సారంగాపూర్ మండలం అడెల్లి మహా పోచమ్మ దేవస్థానాన్ని ఈనెల 3వ తేదీన మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల వరకు (ఒక్క గంట మాత్రమే) భక్తులకు దర్శనాలు కల్పిస్తామన్నారు. తరువాతి రోజు బుధవారం ఉదయం 6 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, నిర్వహించిన అనంతరం యథావిధిగా భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు.