సత్యసాయి: లేపాక్షి ఆలయంలో ఈ నేల 3న సంభవించే చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం నిత్యపూజల అనంతరం 8.30 గంటలకు తలుపులు మూయబడతాయి. మరుసటి రోజు 4న ఆలయ శుద్ధి, అభిషేకాల తరువాత ఉదయం 8 గంటల నుంచి భక్తులకు దర్శనం ఉంటుంది. ఈ విషయాన్ని కార్యనిర్వాహణాధికారి ఎం.హెచ్ నరసింహమూర్తి తెలియజేశారు.