టోల్గేట్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి టోల్గేట్లలో నగదురహిత లావాదేవీలు జరగాలని ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ పేమెంట్లనే అనుమతించాలని సూచించింది. దీంతో ఇకపై టోల్ప్లాజాల్లో ఫాస్టాగ్, యూపీఐ చెల్లింపులకు మాత్రమే అనుమతి లభించనుంది.