NZB: తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న బీటెక్ మొదటి సెమిస్టరు పరీక్షలు నేటితో ముగిశాయి. శుక్రవారం ఉదయం జరిగిన పరీక్షకు 71 మంది విద్యార్థులకు గాను 71 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో కృషి చేసిన సిబ్బందిని వర్సిటీ ఉన్నతాధికారులు అభినందించారు.