CTR: SR పురం మండలం, ఏయంపురం ఆది ఆంధ్రవాడ గ్రామంలో ఎస్సై సుమన్ ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో గంజాయి అమ్మిన, తాగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాటు సారా, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటే బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.