E.G: నిడదవోలు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం సాయంత్రం జగన్నాథరావు ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో సమావేశమై మండల అభివృద్ధి పనులపై సమీక్షించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.