అన్నమయ్య: రుద్రవరం మండలం అప్పనపల్లిలో నివాసం ఉంటున్న పల్లె శివలక్ష్మి (30) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై జయప్ప శనివారం తెలిపారు. భర్త మద్యానికి బానిసయ్ కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.