PLD: వెల్దుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులను అర్జీల రూపంలో సమర్పించవచ్చు. అలాగే, ఉదయం 9 గంటలకు సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు తెలిపారు.