సత్యసాయి: జిల్లాలోని పలు డైరీలు, పాల కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎనుములపల్లి, జగరాజుపల్లె, కొత్తచెరువు, బత్తలపల్లి ప్రాంతాల్లోని ఐదు ప్రధాన డైరీల నుంచి పాల నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపారు. పాలలో పిండి పదార్థాలు, యూరియా వంటి హానికర రసాయనాలు కలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.