హనుమకొండలో జరిగిన తాగునీటి శుద్ధికరణ పథక కమిటీల మహాసభలో ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. వితంతువులు, ఒంటరి మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తాను సిఫార్సు చేసినట్లు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో తాగునీటి శుద్ధికరణ కేంద్రాలు కీలకమని పేర్కొన్నారు. నీటి నాణ్యతపై కమిటీలు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.