కోనసీమ: రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్య ఇస్తుందని నగరం ఏఎంసీ ఛైర్మన్ పెనుమాల లక్ష్మి అన్నారు. మామిడికుదురు మండలంలోని పెదపట్నం లంక గ్రామంలో నూతనంగా చేపట్టబోయే రహదారి అభివృద్ధి పనులకు ఆమె స్థానిక నాయకులతో కలిసి శనివారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొమ్ముల జంగమయ్య, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.