పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ పంచాయతీ పరిధిలోని ఓడ్రుబంగి గ్రామానికి డోలి రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించడం కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.